📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

ప్రశ్నిస్తే సంకెళ్లు… నిలదీస్తే అరెస్టులు ఇదేమి ఇందిరమ్మ రాజ్యం – కేటీఆర్

Author Icon By Sudheer
Updated: November 18, 2024 • 8:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో ప్రశ్నిస్తే సంకెళ్లు, నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై KTR మండిపడ్డారు. ‘నియంత రాజ్యమిది, నిజాం రాజ్యాంగమిది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీపు అరెస్ట్ చేశారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావు. నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే కొణతం దిలీప్ గారిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఎన్నాళ్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్య ప్రేమికులం… ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని పేర్కొన్నారు.

నీ అక్రమ అరెస్టులకో… నీ ఉడత బెదిరింపులకో భయపడేది లేదు, ఈ అక్రమ అరెస్టులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని పేర్కొన్నారు. మిస్టర్ రాహుల్ గాంధీ అంటూ ఆయనను ఉద్దేశించి ఇంగ్లీష్‌లో మరో ట్వీట్ చేశారు. మీ ద్వంద్వ వైఖరి కలవరపెడుతోందని, అసలు మీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మోదీ-అదానీ కలిస్తే స్కాం అయితే… రేవంత్-అదానీ కలిస్తే న్యాయం అవుతుందా? అని నిలదీశారు.

ధారవికి లక్ష కోట్లు వెచ్చిస్తున్నప్పుడు అది కుంభకోణమైతే… మూసీ ప్రాజెక్టుకు లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తే న్యాయం అవుతుందా? అని నిలదీశారు. మీ వైఖరి బీజేపీకి భిన్నంగా ఉందా? మీ వైఖరి రాష్ట్రానికి రాష్ట్రానికి… ఎన్నికలకు ఎన్నికలకు మారుతుందా? అని ప్రశ్నించారు.

congress ktr rahul revanth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.