📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్

Author Icon By Vanipushpa
Updated: January 25, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. బీజేపీ సీనియర్ నేత, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్‌ను నవంబర్ 2023లో 15 రోజుల పాటు ట్యాప్ చేసినట్లు తాజాగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేన రెడ్డి పీఏను విచారించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇంద్రసేనరెడ్డి త్రిపుర గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అక్టోబరు 19, 2023లో ఇంద్రసేన రెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాతే ఆయన ఫోన్ ట్యాప్ చేయడం గమనార్హం.
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి నేతలపైనే నిఘా పెట్టినట్టు భావించారు. అధికారుల దర్యాప్తులో బీజేపీకి సంబంధించి నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా ఉన్న ఇంద్రసేనరెడ్డి ఫోన్‌‌ను కూడా రెండు వారాల పాటు ట్యాపింగ్‌ చేసినట్టు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆయన పీఏను కూడా అధికారులు విచారించారు. ఇంద్రసేన రెడ్డికి సంబంధించిన అన్ని వ్యవహారాలను పీఏ చూస్తున్న నేపథ్యంలో.. ఆయనను ఇందులో సాక్షిగా చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి ఇంద్రసేన రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, గవర్నర్‌గా ఉన్న సమయంలో ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేదానిపై పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది.

indra sena reddy PA Phone Tapping Case Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.