📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు

Author Icon By Uday Kumar
Updated: December 17, 2024 • 10:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వినాయక నిమజ్జనంలో ఏఐ టెక్నాలజీ వినియోగానికి పురస్కారం

హైదరాబాద్‌, డిసెంబరు 17 : వినాయక విగ్రహాల నిమజ్జనంలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగించినందుకు రాష్ట్ర పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ఈ ఏడాది గణేష్‌ చతుర్థి ఉత్సవాల్లో లక్షన్నరకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. లక్షలాది మంది పాల్గొన్న ఈ ఉత్సవాల్లో తొలిసారి ఏఐ, జియోగ్రఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం(జీఐఎస్‌) వినియోగించారు. భారీ సమావేశాలు, ట్రాఫిక్‌ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగించారు. తొక్కిసలాట జరగకుండా ఏఐ టెక్నాలజీతో అనుసంధానమైన డ్రోన్లను వినియోగించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన ఈ విధానం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందింది.

ప్రజారక్షణలో ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్న ప్రభుత్వాలు, సంస్థలకు.. ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ ఐఎ్‌సజీ, సీఎన్‌బీసీ-టీవీ18 సంస్థలతో కలిసి అవార్డులు అందించగా.. డిజిటల్‌ ఇంజినీరింగ్‌ అవార్డులలో చాలెంజర్‌ క్యాటగిరీలో అత్యుత్తమ స్థిరత్వ కార్యక్రమ(టాప్‌ సస్టెయినబిలిటీ ఇనిషియేటివ్‌) పురస్కారం తెలంగాణ పోలీసు శాఖకు ప్రకటించారు. ఈ క్యాటగిరీలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 230 నామినేషన్ల నుంచి తెలంగాణ పోలీసులకు పురస్కారం దక్కింది. స్మార్ట్‌ సిటీ టెక్నాలజీలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రామాణికాలను నిర్దేశించిందని అవార్డుల కమిటీ ప్రశంసించింది. ఈ అవార్డు దక్కడంపై అదనపు డీజీపీ వి.వి.శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ వినియోగానికి ఈ పురస్కారం దక్కడం మరింత ప్రోత్సాహాన్ని అందించిందని అన్నారు.

hyderabad Hyderabad Police Telangana telangana police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.