हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్

Sudheer
తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్

తెలంగాణలో మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌లో జరిగిన ఘటనలో మద్యం తాగి కారు నడిపిన వ్యక్తి.. బైకుపై వెళ్తున్న దంపతులతో పాటు ఆటోపైకి కారు తీసుకెళ్లడంతో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి దుర్ఘటనలను నిరోధించేందుకు ట్రాఫిక్ పోలీసులు మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

మద్యం మత్తులో వాహనం నడిపితే కేసు నమోదు చేయడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేసే చర్యలు కూడా తీసుకుంటున్నారు. అధిక వేగం లేదా మద్యం మత్తులో వాహనాలను నడిపిన వారిపై కూడా ఇదే విధంగా చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టంచేశారు. రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా ఈ నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 15,209 లైసెన్సులను సస్పెండ్ చేయడం గమనార్హం.

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడినవారిపై చర్యలు తీసుకునే విషయంలో రవాణా శాఖ వేగం పెంచుతోంది. ఒకే వ్యక్తి మూడుసార్లు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే అతడి లైసెన్సును రద్దు చేసే ప్రక్రియను ట్రాఫిక్ పోలీసులు సిఫార్సు చేస్తున్నారు. రవాణా శాఖ దీనికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోనుంది.

పోలీసులు, రవాణా శాఖ సంయుక్తంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి డ్రైవింగ్ లైసెన్సుల డేటాబేస్‌ను సక్రమంగా నిర్వహించాలని భావిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్, అధిక వేగం, ఓవర్ లోడ్ వంటి కేసుల్లో పట్టుబడిన వ్యక్తుల వివరాలను ఆధార్ లేదా ఫోటో ద్వారా డేటాబేస్‌తో అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా నేరస్థులపై వేగంగా చర్యలు తీసుకోవచ్చు. వాహనదారులు తమ భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం కేవలం నేరం కాకుండా, ప్రాణాలకు హానికరం అని గుర్తించాలి. రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలు ప్రమాదాలను తగ్గించే దిశగా ఎంతగానో దోహదం చేస్తాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870