हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్

Sudheer
తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్

తెలంగాణలో మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌ లంగర్‌హౌజ్‌లో జరిగిన ఘటనలో మద్యం తాగి కారు నడిపిన వ్యక్తి.. బైకుపై వెళ్తున్న దంపతులతో పాటు ఆటోపైకి కారు తీసుకెళ్లడంతో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. ఇలాంటి దుర్ఘటనలను నిరోధించేందుకు ట్రాఫిక్ పోలీసులు మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

మద్యం మత్తులో వాహనం నడిపితే కేసు నమోదు చేయడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేసే చర్యలు కూడా తీసుకుంటున్నారు. అధిక వేగం లేదా మద్యం మత్తులో వాహనాలను నడిపిన వారిపై కూడా ఇదే విధంగా చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టంచేశారు. రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా ఈ నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 15,209 లైసెన్సులను సస్పెండ్ చేయడం గమనార్హం.

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడినవారిపై చర్యలు తీసుకునే విషయంలో రవాణా శాఖ వేగం పెంచుతోంది. ఒకే వ్యక్తి మూడుసార్లు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే అతడి లైసెన్సును రద్దు చేసే ప్రక్రియను ట్రాఫిక్ పోలీసులు సిఫార్సు చేస్తున్నారు. రవాణా శాఖ దీనికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోనుంది.

పోలీసులు, రవాణా శాఖ సంయుక్తంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి డ్రైవింగ్ లైసెన్సుల డేటాబేస్‌ను సక్రమంగా నిర్వహించాలని భావిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్, అధిక వేగం, ఓవర్ లోడ్ వంటి కేసుల్లో పట్టుబడిన వ్యక్తుల వివరాలను ఆధార్ లేదా ఫోటో ద్వారా డేటాబేస్‌తో అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా నేరస్థులపై వేగంగా చర్యలు తీసుకోవచ్చు. వాహనదారులు తమ భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం కేవలం నేరం కాకుండా, ప్రాణాలకు హానికరం అని గుర్తించాలి. రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలు ప్రమాదాలను తగ్గించే దిశగా ఎంతగానో దోహదం చేస్తాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870