కొత్త సంవత్సర సందర్బంగా డిసెంబర్ 31 వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్న మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆ రోజు అర్ధరాత్రి దాకా వైన్ షాపులు తెరుచుకోవచ్చని అనుమతిచ్చింది. బార్లు, రెస్టారెంట్లు రాత్రి ఒంటిగంట దాకా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పింది. ఈమేరకు ఎక్సైజ్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు, పలు ఈవెంట్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే స్పెషల్ ఈవెంట్లకు పలు షరతులతో అనుమతినిచ్చింది. పార్టీలు, పబ్ లలో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించింది. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, వైన్ షాపులు అర్ధరాత్రి దాకా తెరిచి ఉంచేందుకు అనుమతినివ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని అధికారవర్గాలు తెలిపాయి.
డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు వైన్ షాపులు
By
Vanipushpa
Updated: December 28, 2024 • 12:26 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.