మల్యాల మం. రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం ఓ కేసులో జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా, ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే జైలు సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందాడు. గతంలో మల్లేశంకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని బంధువులు తెలిపారు…
జగిత్యాల సబ్ జైలులో గుండెపోటుతో మృతి..
By
Uday Kumar
Updated: December 19, 2024 • 6:04 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.