📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

చీరలు కట్టుకొని బస్సు ఎక్కి దివ్యాంగుల నిరసన

Author Icon By Sudheer
Updated: April 3, 2025 • 1:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్టీసీ బస్సుల్లో తమకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ (D) వర్ధన్నపేటలో కొందరు దివ్యాంగులు చీరలు కట్టుకొని బస్ ఎక్కి నిరసన తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తాము నిత్యం ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు బస్సుల్లో ఉన్న ఒక సీటుతో పాటు అదనంగా మరో 2 సీట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం దివ్యాంగులకు శాపంగా మారుతున్నదన్నారు. ఉచిత ప్రయాణంతో దివ్యాంగులకు బస్సుల్లో సీట్లు దొరకడంలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మహిళలు తమకు సంబంధించిన సీట్లలో కూర్చోవడంతో దివ్యాంగులకు సీట్లు దొరక్క‌ ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బస్సుల్లో దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ షరీఫ్‌, రాష్ట్ర బాధ్యులు కొల్లూరి ఈదయ్య, గుడిపెల్లి సుమతి, జెట్టబోయిన శ్రీనివాస్‌, ఇస్లావత్‌ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల ఉపయోగం ఉంటుందని అంత భైవించారు కానీ ఉపయోగం కంటే వృధానే ఎక్కువగా ఉంది. ఎక్కడ చూడు ఫ్రీ అని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. అవసరం ఉన్న లేకపోయినా బస్సు ప్రయాణాలు చేయడం వల్ల మగవారికి ఇబ్బందిగా మారింది. ఎక్కడ కూడా సీట్లు దొరకని పరిస్థితి. గంటల కొద్దీ ప్రయాణం నిల్చువాల్సి వస్తుందని వారంతా ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తమకు కూడా ప్రత్యేక బస్సు లను అందుబాటులోకి తీసుకరావాలని కోరుతున్నారు.

free bus PROTEST

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.