📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్

Author Icon By Vanipushpa
Updated: December 27, 2024 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గురువారం వెలుగు చూసిన కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ,లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ డెత్ కేసులో మిస్టరీ వీడటం లేదు. ముగ్గురూ సూసైడ్ చేసుకున్నారా లేక ఎవరైనా బ్లాక్ మెయిల్‌ ప్రాణాలు తీసుకునేందుకు ప్రేరేపించాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పూటకో మలుపు తిరుగుతున్న ఈకేసులో పోలీసులు కీలకమైన విషయాల్ని రాబట్టారు.
వాట్సాప్ చాటింగ్‌ డేటాను సేకరించిన పోలీసులు
మృతుల కాల్ డేటాతో పాటు వాళ్ల వాట్సాప్ చాటింగ్‌ సేకరించారు. ఇప్పుడు ఈకేసులో ఇదే అత్యంత కీలకంగా మారినట్లుగా తెలుస్తోంది. చనిపోయే ముందు ముగ్గురూ ఒకే కారులో అడ్లూరు దగ్గరున్న ఎల్లారెడ్డి చెరువు దగ్గరకు వెళ్లినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది.
వివాహేతర సంబంధమే కారణమా?
వివాహేతర సంబంధం ఇద్దరు వ్యక్తులతో పాటు మరొకరి ప్రాణాల్ని బలిగొంది. కామారెడ్డి జిల్లాలో ఇటీవల బిక్నూర్ ఎస్ఐ సాయికుమార్, కానిస్టేబుల్ శృతితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురూ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తులు బలవన్మరణం చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే కానిస్టేబుల్ శృతి, ఎస్ఐ సాయికుమార్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగినట్లుగా తెలుస్తోంది. వీళ్లిద్దరికి మధ్యవర్తిగా ఉన్న నిఖిల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది ఇప్పుడు ఈకేసులో కీలకంగా మారింది. అయితే మృతుల కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ సేకరించిన పోలీసులు ఆదిశగా కూపీ లాగుతున్నారు. గత వారం రోజులుగా వీళ్లు ముగ్గురూ రెగ్యులర్ గా కాల్స్ చేసుకోవడంతో పాటు ఎక్కువ సేపు చాటింగ్ చేసుకున్నట్లుగా తేలింది. అయితే వాళ్ల మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది అనే దాని ఆధారంగా కేసు విచారణ జరపనున్నారు. త్వరలో అన్ని వివరాలు తెలుపుతామని, ప్రస్తుతం కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

si and constable Suicide Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.