📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఎమ్మెల్సీ కవిత మామఫై కేసు నమోదు

Author Icon By Vanipushpa
Updated: December 13, 2024 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయింది.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌లోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ ఎదుట ఉన్న స్థలం విషయంలో రామ్ కిషన్ రావుకు, కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ కు మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తున్నది
. ఈ వ్యవహారంలో నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయని ఎస్‌హెచ్‌వో మహమ్మద్‌ ఆరీఫ్‌ వెల్లడించారు.
ఆరోపణలు నిజం కాదు
ఇదిలా ఉండగా, ఇదే స్థలం తమదంటూ మైనంపల్లి హన్మంతరావు బంధువు నగేశ్ కుమార్ వాదిస్తున్నారు. తాము రోడ్డు స్థలాన్ని కబ్జా చేశామంటూ తమపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, అది తన సొంత స్థలం అని నగేశ్‌ కుమార్‌ చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పోలీస్ స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఈ స్థలంతో రామ్‌కిషన్‌ రావుకు అసలు సంబంధమే లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నగేశ్‌ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామ్ కిషన్ రావు, అపార్ట్‌మెంట్‌ వాసి గోపితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లిక్కర్ స్కాములో నిందితురాలిగా వున్న కవిత ప్రస్తుతం బెయిల్ ఫై వున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కేసు ప్రాదాన్యత సంతరించుకుంది. కాగా, ఆర్‌కేఆర్‌ అపార్ట్‌మెంటు ఎదుట ఉన్న రోడ్డు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, తాము అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడ్డారంటూ సదరు అపార్ట్‌మెంట్ వాసి గోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తమను కులం పేరుతో దూషించారని, అంతు చూస్తానంటూ కిషన్ రావు అనుచరులు బెదిరించి దాడికి పాల్పడ్డారని వివరించారు. దీంతో రామ్‌కిషన్‌ రావు, మాజీ కార్పొరేటర్‌ భర్త సుదామ్‌ రామ్‌చంద్, నగేశ్, ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.

#Nizamabad brs kavitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.