📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఎన్ని కేసులు పెట్టినా భయపడం : ఎమ్మెల్సీ కవిత

Author Icon By Vanipushpa
Updated: January 7, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నది జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మా నాయకులను జైల్లో పెట్టడమే పనిగా పెట్టుకుందని ఆమె విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని, ప్రజల హక్కుల కోసం ప్రజల పక్షాన నిలబడి ప్రజా వాణిని వినిపిస్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కవిత ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. బోథ్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్, ఇతర బి.ఆర్.ఎస్ నాయకులు కవిత వెంట ఉన్నారు. భూమి కోసం భుక్తి కోసం పోరాడి అమరులైన వారి త్యాగాలను స్మరిస్తే ఉత్తేజం కలుగుతోందని అన్నారు. అదే స్పూర్తితో ప్రజా సమస్యలపై పోరాడుతామని అన్నారు.


రైతు భరోసాపై మాట తప్పింది
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వం మాట తప్పిందని, రైతులకు 15 వేల రూపాయల ఇస్తామని ఇప్పుడు 12 వేలకు తగ్గించి ముఖ్యమంత్రి రైతులను మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బిఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళనలకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేస్తూ వేధిస్తోందని అన్నారు.

brs Congress government mlc kavitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.