ఆదిలాబాద్‌కు కోటి 50 లక్షల ప్రత్యేక నిధులు ప్రకటించిన ప్రభుత్వం

Read Time:  1 min
cm revanth delhi
cm revanth delhi
FONT SIZE
GET APP

ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించింది, ఇందులో భాగంగా దండారి గుస్సాడి డ్యాన్స్ ఫెస్టివల్ కోసం 1.50 కోట్లు ఆర్థిక సహాయం అందించింది. ఈ ఉత్తర్వులు బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జారీ చేశారు.

ఆదివాసీ, గిరిజన సంస్కృతులను గౌరవించడం, కాపాడుకోవడం, మరియు భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఉట్నూర్ ఐటీడీఏ పీవో తెలిపారు. ప్రతి దండారికి 15 రూపాయల చొప్పున నిధులను కేటాయించడం జరిగిందని ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా ప్రకటించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సహకారంతో ఈ నిధులు ఇవ్వడం సంతోషకరంగా ఉందని ఆమె వెల్లడించారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.