తెలంగాణ రాష్ట్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆమె మృతి చెందగా, న్యాయరంగం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. 2022లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన గిరిజా, అప్పటి నుంచి న్యాయవ్యవస్థకు నిష్ఠతో సేవలందించారు. ఆమె మృతిపై న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.
సుదీర్ఘ సేవా
విశాఖపట్నానికి చెందిన గిరిజా ప్రియదర్శిని, NBM లా కాలేజీలో లా, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా తదితర విభాగాల్లో పీజీ పూర్తిచేశారు. 1995లో లాయర్గా రిజిస్టర్ అయిన ఆమె విశాఖ జిల్లా కోర్టులో 7 సంవత్సరాలు న్యాయవాదిగా పని చేశారు. అనంతరం 2008లో అదనపు జిల్లా జడ్జిగా నామినేట్ అయ్యారు. విజయనగరం, నంద్యాల, ఖమ్మం, కరీంనగర్ వంటి అనేక జిల్లాల్లో న్యాయమూర్తిగా పనిచేసి ప్రజలకు న్యాయం అందించడంలో ఆమె నిరంతరం కృషి చేశారు.
లోక్ అదాలత్ల ద్వారా ప్రజలకు న్యాయం
జస్టిస్ గిరిజా ప్రియదర్శిని న్యాయరంగంలో సాదరంగా గుర్తింపు పొందింది లోక్ అదాలత్ల నిర్వహణలో ఆమె చూపిన నిబద్ధత వల్ల. ఆమె నిర్వహించిన లోక్ అదాలత్ల ద్వారా వేలాది కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా కూడా సేవలందించిన ఆమె, న్యాయ సేవలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేశారు. ఆమె అకాల మరణం రాష్ట్ర న్యాయరంగానికి తీరని లోటు అని చెప్పకతప్పదు.
Read Also : Caste Census 2025 : కులగణన విషయంలో బీజేపీ వ్యూహం అదేనా..?