Telangana EAPCET Notification today

నేడు తెలంగాణ ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 (EAPCET) నోటిఫికేషన్‌ మరికాసేపట్లో విడుదల కానుంది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) వెల్లడించింది. ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

తెలంగాణతోపాటు ఏపీలోని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు

ఇప్పటికే ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ను టీజీసీహెచ్‌ఈ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిప్రకారం ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈఏడాది కూడా ఈఏపీసెట్‌ను జేఎన్టీయూ నిర్వహించనుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌, విజయవాడ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా, కన్వీనర్‌ కోటా బీటెక్‌ సీట్లు మొత్తం రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

నాన్‌ లోకల్‌ కోటా రద్దు..

ఇప్పటివరకు అమలులో ఉన్న 15 శాతం నాన్‌ లోకల్‌ కోటాను రద్దు కానుంది. కన్వీనర్‌ కోటా సీట్లన్నీ తెలంగాణకు చెందిన విద్యార్థులకే కేటాయించనున్నారు. ఇంజినీరింగ్‌ సీట్లను 70 శాతం కన్వీనర్‌ కోటాలో, 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కన్వీనర్‌ కోటాలోని 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడేవారు. అయితే ఉమ్మడి రాజధాని, రాష్ట్ర విభజన గడువు పదేండ్లు గతేడాదితో పూర్తయ్యాయి. దీంతో నాన్‌లోకల్‌ కోటా గడువు కూడా ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో కన్వీనర్‌ కోటాలోని పూర్తి సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే దక్కనున్నాయి.

Related Posts
‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ విడుదల ఫిక్స్..?
'Game changer' police instr

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కలయికలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ మూవీ లో రామ్ చరణ్ Read more

ఆంధ్రప్రదేశ్‌లో 65 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ లో 65 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం విశాఖపట్నంలో పర్యటించి, కొన్ని కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం మరియు మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 2024లో మూడవసారి ప్రధాన మంత్రిగా Read more

నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు
నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి తీవ్ర పోటీల మధ్య జరుగుతున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆప్ ప్రభుత్వం ఎవరూ ఊహించని Read more

సిరియాలో కొనసాగుతున్న మారణకాండ
సిరియాలో కొనసాగుతున్న మారణకాండ

సిరియాలో ప్రభుత్వ అనుకూల దళాలు తమ ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నాయి. దేశంలో ఐదు రోజులుగా సాగుతున్న అంతర్యుద్ధంలో వందల సంఖ్యలో సాయుధులు మృత్యువాత పడుతున్నారు. గత ఏడాది Read more