ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL దేశవ్యాప్తంగా వినియోగదారులకు VoiceOver WiFi(VoWiFi) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలతో మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా స్పష్టమైన వాయిస్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది.
Read Also: AI: కృత్రిమ మేధస్సులో 2025 కీలక మైలురాయి
వైఫై ఉంటే చాలు.. నిరవధిక వాయిస్ కాల్స్
ఇకపై మొబైల్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా వైఫై కనెక్షన్ ఉంటే చాలు, ఎలాంటి అంతరాయం లేకుండా కాల్స్ చేయవచ్చని BSNL తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ యూజర్లందరికీ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని సంస్థ అధికారికంగా ప్రకటించింది. VoiceOver WiFi టెక్నాలజీ ద్వారా కాల్ డ్రాప్స్ సమస్య పూర్తిగా తగ్గిపోతుందని, వినియోగదారులకు మెరుగైన కాలింగ్ అనుభవం లభిస్తుందని BSNL స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇండోర్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: