భారతీయ రైల్వే పట్టాల మధ్య కనిపించే కంకర రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ (Track Ballast) అంటారు. ఇవి సాధారణ రాళ్లు కాదు. వేల టన్నుల బరువు కలిగిన రైళ్లు వేగంగా వెళ్తున్నప్పుడు పట్టాలపై పడే ఒత్తిడిని భూమికి సమానంగా పంచే కీలక బాధ్యత వీటిదే. ఈ రాళ్లు లేకపోతే రైలు (Train) పట్టాలు కుంగిపోవడం, పక్కకు జరగడం వంటి ప్రమాదాలు జరగవచ్చు.
Read also: Online: 2016ని ఆన్లైన్లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?
Why are crushed stones laid between the railway track
రైలు పట్టాలకు స్థిరత్వం ఎలా అందిస్తాయి?
ట్రాక్ బ్యాలస్ట్ రాళ్లు గుండ్రంగా కాకుండా పదునైన అంచులతో ఉంటాయి. దీంతో ఒక రాయి మరో రాయితో బలంగా లాక్ అవుతుంది. రైలు ప్రయాణ సమయంలో వచ్చే ప్రకంపనలను ఇవి తగ్గించి, పట్టాలు కదలకుండా స్థిరంగా ఉంచుతాయి. ఫలితంగా రైలు ప్రయాణం సురక్షితంగా, మృదువుగా సాగుతుంది.
నీటి పారుదల & భద్రతలో కీలక పాత్ర
ఈ కంకర రాళ్లు వర్షపు నీరు వెంటనే భూమిలోకి ఇంకిపోయేలా చేస్తాయి. దీంతో ట్రాక్ కింద నీరు నిల్వ ఉండదు. అలాగే పిచ్చి మొక్కలు పెరగకుండా అడ్డుకుంటాయి. ఇవన్నీ కలిసి రైల్వే ట్రాక్ దీర్ఘకాలం బలంగా ఉండేందుకు సహాయపడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: