భారతదేశంలో డిజిటల్ రంగంలో మరో గొప్ప అడుగు పడింది. ఛత్తీస్గఢ్ రాజధాని నవరాయ్పూర్లో దేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డేటా సెంటర్ పార్క్కు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి శంకుస్థాపన చేశారు. ఈ డేటా సెంటర్ కేవలం డేటా నిల్వ చేయడానికి మాత్రమే కాకుండా, డిజిటల్ యుగానికి వెన్నెముకగా నిలవనుందని ఆయన చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ డిజిటల్ పవర్హౌస్గా తీర్చిదిద్దడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.
రాక్బ్యాంక్ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టు
ఈ డేటా సెంటర్ పార్క్ను రాక్బ్యాంక్ డేటాసెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. మొత్తం 14 ఎకరాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేస్తుండగా, ఇందులో 2.7 హెక్టార్ల విస్తీర్ణం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)గా రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భవిష్యత్తులో సుమారు రూ. 2,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు సమాచారం. ఇది దేశంలో డేటా భద్రత, అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో మరింత అభివృద్ధికి దోహదం చేయనుంది.
ఉపాధి అవకాశాలతో యువతకు నూతన దారి
ఈ డేటా సెంటర్ పార్క్ వల్ల ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సాంకేతిక రంగంలో గణనీయమైన ప్రోత్సాహం లభించనుంది. దాదాపు 1,500 మంది పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ఈ డేటా సెంటర్ వల్ల యువత ఇకపై ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది రాష్ట్రానికి సాంకేతిక రంగంలో కీలక మలుపుగా నిలుస్తుందన్నారు.
Read Also : Indian Military Information : పాక్ కు భారత సైనిక సమాచారం లీక్..ఇద్దరి అరెస్ట్