తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘వాట్సాప్ మీ-సేవ’ డిజిటల్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజల దరికి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ విధానం ద్వారా ఇప్పటికే 3.25 లక్షల మందికి పైగా పౌరులు వివిధ సేవలు పొందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 4.5 లక్షల మంది తమ మొబైల్ నంబర్లను నమోదు చేసుకున్నారని తెలిపింది.
Read Also: Digital Banking: SBI నుంచి IMPS ట్రాన్సాక్షన్లపై కొత్త సర్వీస్ ఛార్జీలు
ప్రభుత్వ కార్యాలయాలు లేదా మీ-సేవ కేంద్రాలకు వెళ్లకుండా, మొబైల్ ఫోన్ ద్వారానే సేవలు పొందేలా ఈ వ్యవస్థను రూపొందించారు. గత ఏడాది నవంబర్ 18న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సేవలను ప్రారంభించారు.
ఒక్క ‘Hi’ మెసేజ్తో 500కి పైగా సేవలు
పౌరులు 8096958096 అనే వాట్సాప్ నంబర్కు ‘Hi’ అని మెసేజ్ పంపడం ద్వారా 10కి పైగా ప్రభుత్వ(Telangana Govt) శాఖలకు చెందిన సుమారు 581 రకాల సేవలను 24 గంటలూ పొందవచ్చు. సర్టిఫికెట్లకు దరఖాస్తు చేయడం, అప్లికేషన్ స్థితి తెలుసుకోవడం, డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవడం వంటి పనులు చాలా సులభంగా జరుగుతున్నాయి.
సర్టిఫికెట్లకు భారీ డిమాండ్
ఈ సేవలను ఉపయోగిస్తున్న వారిలో ఎక్కువ మంది కులం, ఆదాయం, జనన, మరణ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్నెట్పై ఎక్కువ అవగాహన లేని వారు కూడా వాట్సాప్ ద్వారా సులభంగా సేవలు పొందగలగడం ఈ పథకం విజయానికి ప్రధాన కారణంగా మారింది.
ప్రభుత్వ సేవలతో పాటు రాష్ట్రంలోని 31 ప్రముఖ ఆలయాలకు సంబంధించిన సేవలను కూడా ఈ వాట్సాప్ నంబర్కు అనుసంధానించారు. దర్శనం టికెట్లు, వసతి గదుల బుకింగ్ వంటి సౌకర్యాలు కూడా మొబైల్ నుంచే పొందేలా ఏర్పాట్లు చేశారు.
అత్యవసర సేవల అనుసంధానం లక్ష్యం
భవిష్యత్తులో 108 అంబులెన్స్, 101 అగ్నిమాపక, 102 వైద్య అత్యవసర సేవలను కూడా ఈ ప్లాట్ఫామ్కు అనుసంధానించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,000 మీ-సేవ కేంద్రాల ద్వారా 2023 నవంబర్ 1 నుంచి 2026 జనవరి 31 వరకు సుమారు 5.98 కోట్ల లావాదేవీలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది. ఈ లావాదేవీల విలువ మొత్తం రూ.3,811 కోట్లకు చేరిందని వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: