టోక్యోలో ఇటీవల జరిగిన ఆట్కోడర్ వరల్డ్ టూర్ ఫైనల్స్ 2025 హ్యూరిస్టిక్ కాంటెస్టు సాంకేతిక లోకానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ పోటీలో పోలెండ్కు చెందిన ప్రోగ్రామర్ ప్రజెమిస్వాఫ్ డెబియాక్ (సైహో) అపూర్వమైన విజయాన్ని అందుకున్నాడు. ఓపెన్ఏఐ (Open AI) అత్యాధునిక కోడింగ్ టూల్ను మట్టికప్పించి మొదటి స్థానాన్ని సాధించాడు.డెబియాక్ ఈ అద్భుత విజయంపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించగా, ఓపెన్ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్ (CEO Shyam Altman) స్పందిస్తూ “గుడ్ జాబ్ సైహో!” అంటూ అభినందనలు తెలిపారు. డెబియాక్కు టెక్ ప్రపంచంలో ‘సైహో’ అనే పేరు ప్రాచుర్యంలో ఉంది.

ఓపెన్ఏఐ రెండో స్థానంలో
ఈ పోటీకి ఓపెన్ఏఐ టూల్ కూడా పోటీదారుగా పాల్గొనడం విశేషం. కానీ, ఫలితాల్లో మానవ మేధస్సు పైచేయి సాధించింది. ఓపెన్ఏఐ అధికారిక ఎక్స్ ఖాతాలో పోటీ ఫలితాలను ధృవీకరించింది. ఈ పోటీలో ఓపెన్ఏఐ స్పాన్సర్గానూ వ్యవహరించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.డెబియాక్ తన విజయం గురించి “మానవ మేధ నవ్వింది… ఈ మూడు రోజులుగా కేవలం 10 గంటలు మాత్రమే నిద్రపోయాను. ఈ పోటీ నాకు జీవనాంతం గుర్తుగా ఉంటుంది” అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అనంతరం మరో పోస్ట్లో “నా ఆధిక్యం 5.5 నుంచి 9.5 శాతం పెరిగింది. ఇది నిజంగా ఉల్లాసంగా ఉంది. ప్రోగ్రామింగ్ను ఇంతమంది ఆసక్తిగా చూస్తుండడం చాలా గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు.
ఏఐకి మించిన మానవ మేధ
ఈ ఘన విజయం మానవ సృజనాత్మకతకు ఓ గుర్తింపు లాంటిది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మానవులు సృజనాత్మకంగా, బలంగా నిలబడగలరని ఈ పోటీ స్పష్టంగా తెలియజేసింది. సైహో చేసిన పని ఓ టెక్ ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తుంది. అతని విజయం భవిష్యత్ మానవ-ఏఐ సంబంధాల్లో కీలక మలుపు చూపించింది.ఈ పోటీ తాలూకు ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. డెబియాక్ విజయం మానవ పరిజ్ఞానానికి, సాంకేతిక పరిణామానికి మధ్య ఉన్న సరిహద్దులను మళ్లీ నిర్వచించింది. టెక్ యుగంలో ఇది ఒక మైలురాయి.
Read Also : Kishan Reddy : మహాకాళి ఆలయాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి