Latest News: Rashmika Mandanna: ఏఐ దుర్వినియోగంపై రష్మిక ఆగ్రహం

Read Time:  1 min
Latest News: Rashmika Mandanna: ఏఐ దుర్వినియోగంపై రష్మిక ఆగ్రహం
FONT SIZE
GET APP

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది కన్నడ భామ రష్మిక మందన్న. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.

Read Also: Most Popular Directors of 2025: ఐఎండీబీ.. ఈ ఏడాది మోస్ట్ పాపుల‌ర్ దర్శకుల జాబితా విడుదల

ప్రగతిశీల సమాజాన్ని నిర్మించడానికి AIని ఉపయోగించాలి

రీసెంట్ గా పుష్ప సినిమాతో, యానిమల్, ఛావా సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు బడా హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. ఇటీవలే హిందీలోసల్మాన్ ఖాన్ సరసన సికిందర్ సినిమాలో నటించింది ఆ సినిమా బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది.

Rashmika Mandanna is angry over the misuse of AI
Rashmika Mandanna is angry over the misuse of AI

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక మందన్న తన సినిమాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రష్మిక మందన్న షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా రష్మిక (Rashmika Mandanna) ఏఐ వాడకం పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

బాధ్యతగా ఉండ‌డం

‘AIని అభివృద్ధి కోసం కాకుండా కొందరు అశ్లీలతను సృష్టించడానికి, మహిళలను లక్ష్యంగా చేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. AIని మంచి కోసం మాత్రమే వాడుకుందాం. ఇలాంటి దుర్వినియోగానికి పాల్పడేవారికి కఠిన శిక్ష విధించాలి’ అంటూ Xలో ర‌ష్మిక (Rashmika Mandanna) రాసుకోచ్చింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.