2027 ఆగస్టు 2న ఆకాశంలో అరుదైన దృశ్యం (A rare sight in the sky on August 2, 2027) కనిపించనుంది. ఈ రోజు ‘గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్’ పేరుతో గుర్తింపు పొందనుంది. చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పేసి, భూమిపై 6 నిమిషాల 23 సెకన్ల పాటు చీకటి ఆవరించనుంది. ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘమైన సూర్యగ్రహణంగా నిలుస్తుంది.ఈ గ్రహణం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా మొదలవుతుంది. అనంతరం ఇది యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంవైపు కదులుతుంది. స్పెయిన్లోని కాడిజ్, మలాగా వంటి ప్రాంతాల్లో 4 నిమిషాలకు పైగా చీకటి కనిపిస్తుంది.ఉత్తర మొరాకోలోని టాంజియర్, టెటౌవాన్, ఈజిప్ట్లోని లక్సర్ దగ్గర 6 నిమిషాలకు పైగా పూర్తిస్థాయి గ్రహణం ఉంటుందనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జెడ్డా, మక్కా, యెమెన్, సోమాలియా ప్రాంతాల్లోనూ ఇది కనిపించనుంది.
భారతదేశంలో గ్రహణం కనిపించదా?
ఈసారి మనకు దురదృష్టమే. ఈ గ్రహణం భారతదేశంలో పూర్తిగా కనిపించదు. తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లోనూ ఇది కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో కేవలం అంచున మాత్రమే చూపు పడుతుంది.ఈ గ్రహణం అఫీలియన్ (భూమి సూర్యునికి దూరంగా ఉన్న స్థితి) సమయంలో జరుగుతుంది. అదే సమయంలో చంద్రుడు పెరిజీ (భూమికి దగ్గరగా ఉండే దశ)లో ఉంటాడు. దాంతో చంద్రుడు పెద్దగా, సూర్యుడు చిన్నగా కనిపిస్తాడు. ఫలితంగా గ్రహణం కాలవ్యవధి పెరుగుతుంది.ఇక, ఇది భూమధ్యరేఖ సమీపంలో ఉండటంతో చంద్రుని నీడ నెమ్మదిగా కదులుతుంది. అందువల్ల టోటలిటీ ఎక్కువసేపు ఉంటుంది.
ఎలా చూడాలి?
ఈ గ్రహణాన్ని సురక్షితంగా చూడాలంటే సోలార్ (Solar Eclipse) వ్యూయర్లు ఉపయోగించాలి. ISO 12312-2 ప్రమాణాల గల గ్లాసులు ధరించాలి. సాధారణ సన్గ్లాసెస్ ఉపయోగించకూడదు. పిన్హోల్ ప్రొజెక్టర్ వంటి పద్ధతులు కూడా ఉపయుక్తమే.ఈ గ్రహణం సమయంలో సూర్యుని కరోనాను పరిశీలించేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ఇది సాధారణ రోజుల్లో సూర్యప్రకాశం వల్ల కనిపించదు. గ్రహణ సమయంలో మాత్రమే ఇది కనిపిస్తుంది. అందుకే, ఇది శాస్త్రీయంగా విలువైన ఘట్టంగా మారనుంది.
Read Also : INS Nistar : భారత నౌకాదళంలో చేరిన డీప్ సీ రెస్క్యూ నౌక ‘నిస్తార్’