Latest news: Data Protection: అమల్లోకి కొత్త నిబంధన..మూడేళ్లు వాడకపోతే యూజర్ డేటా డిలీట్

Read Time:  1 min
Data Protection
Data Protection
FONT SIZE
GET APP

భారత ప్రభుత్వం డిజిటల్ వినియోగదారుల డేటా భద్రతను మరింత మమేకం చేసేందుకు కీలక ముందడుగు వేసింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం కింద కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. ఈ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా, ఈ-కామర్స్(E-commerce) ఆన్‌లైన్ గేమింగ్ వంటి (Data Protection)డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు మూడేళ్లపాటు వినియోగం లేకున్న యూజర్ల వ్యక్తిగత డేటాను తప్పనిసరిగా తొలగించాలి. డేటా తొలగించే ముందు సంబంధిత యూజర్‌కు 48 గంటల నోటీసు ఇవ్వడం అవసరం. యూజర్ ఆ గడువులో స్పందించకపోతే వారి డేటా శాశ్వతంగా డిలీట్ చేయబడుతుంది.

 Read also: పొట్టు పొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్

Data Protection
Data Protection

పెద్ద కంపెనీలకు ఆడిట్ & డేటా ఇంపాక్ట్ అసెస్‌మెంట్

50 లక్షల మందికి పైగా యూజర్లు ఉన్న డిజిటల్(Data Protection) ప్లాట్‌ఫార్మ్‌లు ముఖ్యమైన డేటా సంరక్షకులుగా పరిగణింపబడతాయి. వీటికి ఏడాదికి ఒకసారి ఆడిట్ మరియు డేటా ప్రొటెక్షన్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ చేయడం తప్పనిసరి. ఈ విధానం డేటా లీక్ భద్రతా లోపాలు యూజర్ హక్కుల ఉల్లంఘనలకు నివారణగా ఉంటుంది. డేటాను దేశ సరిహద్దులు దాటించి బదిలీ చేయడానికి కూడా ప్రభుత్వం నిర్దిష్ట నియమాలను రూపొందించింది. విదేశీ ప్రభుత్వాలు లేదా అంతర్జాతీయ సంస్థలకు డేటా బదిలీ చేయడానికి ప్రత్యేక అనుమతులు అవసరం. ఈ విధంగా యూజర్ డేటా భద్రత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

స్పష్టమైన మార్గనిర్దేశం

డేటా సేకరణ, ప్రాసెసింగ్, భద్రత, రిటెన్షన్ మరియు తొలగింపు ప్రక్రియల్లో కంపెనీలు పూర్తి పారదర్శకత కలిగించాలి. వినియోగదారులు ఎటువంటి డేటా సేకరణ జరుగుతోందో, దానిని ఎలా వాడుతుందో తెలుసుకోవడానికి వీలు కల్పించాలి. ఈ కొత్త మార్గదర్శకాలు భారతీయ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు వ్యక్తిగత డేటా నిర్వహణలో స్పష్టతను ఇచ్చాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.