Team India is the champion.. How much is the prize money?.jpg

ఛాంపియన్‌గా టీం ఇండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే?

దుబాయ్‌: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై భారత్ గెలుపొందింది. ఈ తరుణంలోనే 25 ఏళ్ల ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఫైనల్‌లో కివీస్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై భారత్ గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

ఛాంపియన్‌గా టీం ఇండియా ప్రైజ్

టీమిండియా ఫ్రైజ్‌ మనీ ఎంతంటే ?

2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్స్ గా నిలిచిన టీమిండియా $2.24 మిలియన్లు అంటే రూ. 20 కోట్లు గెలుచుకుంది. రెండవ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ $1.12 మిలియన్లు అంటే రూ. 10 కోట్లు సంపాదించింది. కాగా, ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రైజ్ మనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటికే ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($ 2.24 మిలియన్లు) లభిస్తాయి. ఫైనల్‌లో ఓడిన జట్టు అంటే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు దాదాపు రూ. 9.74 కోట్లు (1.12 మిలియన్ డాలర్లు) లభిస్తాయి.

నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్ మనీ

ఇక, సెమీ-ఫైనల్స్‌లో ఓడిపోయిన జట్లు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దాదాపు రూ. 4.87 కోట్లు (US$ 5,60,000) అందుకుంటాయి. గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్ మనీ లభిస్తుంది. ఐదు, ఆరవ స్థానంలో నిలిచిన జట్లు (ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్) సమాన మొత్తంలో $3,50,000 (సుమారు రూ. 3.04 కోట్లు) అందుకుంటాయి. ఏడవ, ఎనిమిదవ స్థానంలో నిలిచిన జట్లు (పాకిస్తాన్, ఇంగ్లాండ్) సమాన మొత్తంలో $1,40,000 (సుమారు రూ. 1.22 కోట్లు) అందుకుంటాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఐసీసీ మొత్తం ప్రైజ్ మనీని $6.9 మిలియన్లు (సుమారు రూ. 60 కోట్లు) అందిస్తోంది. ఇది 2017 కంటే 53 శాతం ఎక్కువ.

Related Posts
హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం..
Hindupuram Municipality won by TDP

అమరావతి: హిందూపురం మున్సిపాలిటీలో టీడీపీ విజయం సాధించింది. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతుతో ఆరో వార్డు కౌన్సిలర్‌ రమేశ్‌ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. Read more

కేటీఆర్ కు భయం పట్టుకుంది – కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్
Congress VIP adisrinivas

ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతున్న.. గత పది Read more

జూన్ తర్వాత తెలంగాణ సీఎం మారబోతున్నారు – మహేశ్వర్ రెడ్డి
bjp maheshwar reddy

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్సీ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని వచ్చే ఏడాది జూన్ నాటికి సీఎం పదవి Read more

డ్రోన్ షోను నిర్వహించిన గోద్రెజ్ ప్రాపర్టీస్
Godrej Properties organized the drone show

హైదరాబాద్‌ : భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్, హైదరాబాద్‌ నగరం యొక్క సాంస్కృతిక వైభవాన్ని మరియు వారసత్వాన్ని వేడుక జరుపుకునేందుకు Read more