సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసుల నోటీసులు
అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు వైఎస్ఆర్సీపీ కీలక నేతల మెడ చుట్టూ బిగుసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన పోలీసులు తాజాగా వైఎస్ఆర్సీపీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీచేశారు. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల ప్రమేయం కూడా ఉందని గుర్తించిన పోలీసులు ఆయన దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు….