Sudan దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మృతి – మానవతా సంక్షోభం తీవ్రతరం
ఆఫ్రికాలోని Sudan మరోసారి తీవ్ర మానవీయ విషాదానికి వేదికైంది. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) ఆధ్వర్యంలో డార్ఫర్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడుల్లో 300 మందికిపైగా పౌరులు మృతి చెందారని ఐక్యరాజ్య సమితి మానవతా సంస్థ వెల్లడించింది. ఈ సంఘటన శుక్రవారం మరియు శనివారం మధ్య జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యూమానిటేరియన్ అఫైర్స్ ప్రకారం, జామ్డామ్ మరియు అబూషాక్ శరణార్థి శిబిరాలపై RSF బలగాలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. ఈ దాడుల్లో 10 మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ మానవతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారు ఆరోగ్య కేంద్రాల్లో విధుల్లో ఉన్న సమయంలో దాడికి గురయ్యారు. ఈ దాడిలో 23 మంది చిన్నారులుగా గుర్తించబడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.Sudan దారుణ ఘటనపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెష్ తీవ్రంగా స్పందించారు. పౌరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వెంటనే శత్రుత్వం ఆపాలని, మానవతా సిబ్బందికి రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ దాడుల కారణంగా రెండు రోజుల్లోనే 60,000 నుంచి 80,000 మంది వ్యక్తులు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ తెలిపింది.
ఘర్షణలు – నేపథ్యం
సూడాన్ అంతర్యుద్ధం 2023 ఏప్రిల్ 15న ప్రారంభమైంది. ఈ గొడవలు సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్ మరియు RSF కమాండర్ మొహమ్మద్ హమ్డాన్ డాగ్లోల మధ్య ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి హింసాత్మక ఘటనలలో 29,600 మందికి పైగా పౌరులు మరణించారు. ఐక్యరాజ్యసమితి ఈ సంఘటనలను మానవ హక్కుల ఉల్లంఘనలుగా పేర్కొంది.ఈ ఘర్షణల కారణంగా దాదాపు కోటి 30 లక్షల మంది ప్రజలు సూడాన్ విడిచి పొరుగు దేశాలకు వలస వెళ్ళాల్సి వచ్చింది. ఇది యునైటెడ్ నేషన్ చరిత్రలో అతిపెద్ద వలస సంక్షోభాలలో ఒకటిగా గుర్తించబడుతోంది.ఈ పరిణామాలు కేవలం సూడాన్ దేశానికే పరిమితం కాకుండా, ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల, అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.సూడాన్ భూభాగం ఇతర ఆఫ్రికన్ దేశాలకు సరిహద్దుగా ఉన్నందున ఈ ఘర్షణలు పొరుగు దేశాలకు కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. చాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సూడాన్ లాంటి దేశాలకు వలసలు పెరుగుతున్నాయి. ఇది అంతర్గత అశాంతిని పెంచే అవకాశముంది. ప్రాంతీయ అస్తిరత ప్రపంచ మార్కెట్లలో నెగటివ్ ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇంకా, సుమారు 16,000 మంది జాన్జమ్ శిబిరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.
మానవ హక్కుల ఉల్లంఘనలపై విచారణలు:
ఈ దాడులలో మహిళలు, పిల్లలు, మానవతా సిబ్బంది లక్ష్యంగా మారడంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. UN Human Rights Council ఇప్పటికే ఈ ఘటనలపై ప్రత్యేక విచారణ ప్రారంభించినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించేందుకు చట్టపరమైన చర్యలు అవసరమవుతాయి.
Read more :
Canada: కెనడాను 51వ రాష్ట్రంగా గుర్తించేందుకు ట్రంప్ యత్నాలు