అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తో విద్యార్థులకు మేలు

విద్యావ్యవస్థను సమూళంగా ప్రక్షాళించి సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈక్రమంలోనే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విధానంపై చర్చించారు. రానున్న ఐదేళ్లలో 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో భాగంగా గ్రామీణ విద్యార్థులకు క్రియేటివిటీ, ప్రాబ్లమ్- సాల్వింగ్ పై నైపుణ్యం, బట్టీ చదువులను రూపుమాపి అప్లికేషన్ విధానంలో విద్యాబోధన లాంటి పలు అంశాలను నేర్పించనున్నారు.

అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను అటల్ ఇన్నోవేషన్ మిషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతిఆయోగ్ రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్) స్కిల్స్ ను పెంపొందించడం ఈ ల్యాబ్య్ ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్స్ లో డీఐవై కిట్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IOT), 3డీ ప్రింటింగ్, రోబోటిక్స్, కోడింగ్ స్కిల్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, అకాడెమీ, ఇండస్ట్రీ నుంచి నిపుణులతో మెంటార్ షిప్ ప్రోగ్రాం, సృజనాత్మకతలో సవాళ్లు, పోటీతత్వం.. తదితర అన్ని విభాగాలను విద్యార్థులకు నేర్పించనున్నారు. భారత్ స్టార్టప్ సిస్టమ్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చిన్నవయసునుంచే విద్యార్థుల్లో స్టార్ట్ అప్ వ్యవస్థలపై అవగాహన కల్పించడం. పాఠశాల నుంచే విద్యార్థులకు టెక్నాలజీని పరిచయం చేయడం ద్వారా భవిష్యత్తులో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా రంగాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.

Related Posts
నితీశ్ కుమార్‌ను ప్రజలుఅంగీకరించరని వ్యాఖ్య
నితీశ్ కుమార్‌ను ప్రజలు అంగీకరించరని వ్యాఖ్య

ఏ కూటమిలో ఉన్నా నితీశ్ కుమార్‌ను ప్రజలు అంగీకరించరని వ్యాఖ్య బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ముఖ్యమంత్రి నితీశ్ Read more

అమెరికా దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి
అమెరికా దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం అగ్ర రాజ్యం అమెరికా వెళ్లి మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి Read more

పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాదే :జైశంకర్‌
పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇండియాదే :జైశంకర్‌

లండన్‌ పర్యటనలో ఒకేసారి ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు, కశ్మీర్‌ వేర్పాటువాదులకు సమాధానం ఇచ్చిన విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ లండన్‌ పర్యటన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌ Read more

మహా కుంభమేళా స్పెషల్ ట్రైన్లను ఆపేసిన ఇండియన్ రైల్వే
Indian Railways stopped Maha Kumbh Mela special trains

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు కోట్లాది మంది వస్తుండటంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళా స్పెషల్‌ ట్రైన్లను ఇండియన్‌ రైల్వే నిలిపివేసింది. తర్వాతి ఆదేశాలు Read more