భారత్-వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి తన అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకుంది.వరుసగా ఆరో మ్యాచ్లో 50కి పైగా పరుగులు చేసిన స్మృతి, ఈసారి 53 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించింది. ఆసీస్ పర్యటన నుంచి స్మృతి ఫామ్లో ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, ఓపెనర్ల అద్భుత భాగస్వామ్యంతో సెంచరీ స్థాయిలో రాణించింది.స్మృతి మంధాన తన హాఫ్ సెంచరీతో మరోసారి రాణించి జట్టుకు పటిష్ఠ ఆరంభాన్ని అందించింది. స్మృతి వరుసగా 6వ మ్యాచ్లో 50కి పైగా స్కోరు చేయడం ఆమె స్థిరమైన బ్యాటింగ్ ఫామ్ను రుజువు చేస్తోంది.ఆస్ట్రేలియాతో చివరిగా ఆడిన వన్డే సిరీస్ నుంచి స్మృతి మంధాన అద్భుతంగా రాణిస్తోంది.ఆ సిరీస్లో, భారత జట్టు ఓడినప్పటికీ, స్మృతి 109 బంతుల్లో 105 పరుగులు చేసి తన సత్తా చాటింది.
ఆ ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన వెంటనే,నవీ ముంబైలో జరిగిన టీ20 సిరీస్లో స్మృతి తన బ్యాటింగ్ ఫామ్ను కొనసాగించింది. తొలి టీ20లో ఆమె 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి భారత్కు విజయాన్ని అందించింది. ఆ మ్యాచ్లో భారత్ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో టీ20 మ్యాచ్లో కూడా స్మృతి చెలరేగి 41 బంతుల్లో 62 పరుగులు చేసింది.ఆమె ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.అయితే, ఆ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది.స్మృతి మంధాన బ్యాటింగ్ ఫామ్ భారత జట్టుకు విజయవంతమైన పునాదులు అందిస్తోంది. స్మృతి ఈ తరహా స్థిరమైన ప్రదర్శన చూపిస్తూ,మహిళల క్రికెట్లో భారత జట్టు విజయాలను ముందుకు తీసుకెళ్తోంది. ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండీస్ సిరీస్లోనూ స్మృతి రాణించడం, ఆమె ఆట తీరును మరో మెట్టుకు తీసుకెళ్లింది.