Cricket match toss : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ముంబై వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మైదానం ఛేజింగ్కు అనుకూలంగా ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
టాస్ అనంతరం రజా మాట్లాడుతూ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం సులభమని అన్నారు. గాయం నుంచి కోలుకున్న రిచర్డ్ నగరవా జట్టులోకి వచ్చాడని వెల్లడించారు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కూడా తాము టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేసేవాళ్లమని తెలిపాడు.
Read Also: Cult Teaser Release: ‘కల్ట్’ టీజర్ చూసారా?
ఇరు జట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. జింబాబ్వేలో నగరవా చేరగా, వెస్టిండీస్ జట్టులో రోస్టన్ చేజ్ స్థానంలో రొమారియో షెఫర్డ్ వచ్చాడు. ఇప్పటికే గ్రూప్-1లో పోటీ తీవ్రమవడంతో సెమీఫైనల్ ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్లో గెలుపు ఇరు జట్లకు అత్యంత కీలకం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: