ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 (ICC Women’s ODI World Cup 2025) గ్రాండ్ ఫైనల్కు వేదిక సిద్ధమైంది. రేపు నవంబర్ 2న భారత మహిళల జట్టు (India Women) ,దక్షిణాఫ్రికా మహిళల జట్టు (South Africa Women) మధ్య తుది పోరు జరగనుంది. ఈ మ్యాచ్ నావీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. రెండు జట్లు సూపర్ ఫార్మ్లో ఉండటంతో అభిమానులు ఈ మ్యాచ్ను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Rohan Boppanna: టెన్నిస్కు రోహన్ బొప్పన్న గుడ్ బాయ్
ఇరు జట్లలో ఏ టీమ్ గెలిచినా మహిళల క్రికెట్ (WWC) లో కొత్త ఛాంపియన్ అవతరిస్తోంది. ఎందుకంటే ఇరు జట్లు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు. ఈ క్రమంలోనే తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు ఇరు జట్లు సన్నదమవుతున్నాయి.ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆనందంలో సౌతాఫ్రికా ఉంటే..
డిఫెండింగ్ ఛాంపియన్, పటిష్ట ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. బలబలాల పరంగా ఇరు జట్లు సమంగా కనిపిస్తున్నాయి.లీగ్ దశలో భారత్పై సౌతాఫ్రికానే పైచేయి సాధించింది. అనవసరం తప్పిదాలతో ఆ మ్యాచ్లో టీమిండియా (Team India) మూల్యం చెల్లించుకుంది.
ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు అని
సెమీఫైనల్లో చూపించిన తెగువను ఫైనల్లోనూ రిపీట్ చేస్తే టీమిండియా సరికొత్త చరిత్రను లిఖిస్తోంది.ఇదిలా ఉంచితే,ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.అయితే ఈ మ్యాచ్ను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు అని క్రికెట్ ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఏ టైం, ఎందులో ఉచితంగా చూడోచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
DD Sports
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మహిళల ODI ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ వేయడానికి అరగంట ముందు.. మధ్యాహ్నం 2:30 గంటలకు.. రెండు జట్ల కెప్టెన్లు మైదానంలోకి దిగుతారు. భారతదేశంలో ఫైనల్ మ్యాచ్ వివిధ స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో లైవ్ ఉంటుంది. క్రికెట్ ఫ్యాన్స్ DD స్పోర్ట్స్ (DD Sports) లో ఈ ఫైనల్ మ్యాచ్ను ఫ్రీగా చూడొచ్చు.
JioHotstar
అంతేకాకుండా క్రికెట్ అభిమానులు తమ మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లలో కూడా JioHotstar యాప్, వెబ్సైట్ ద్వారా ఇండియా-దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచ కప్ 2025 (WWC 2025) ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్ను ఉచితంగా చూడవచ్చు.
దీని కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయనవసరం లేదు. భారత జట్టు ప్రపంచ కప్ ఫైనల్ (WWC 2025) కు చేరుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలో టీమ్ ఇండియా 2005, 2017లో ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది. కానీ టైటిల్ను గెలుచుకోలేకపోయింది.
పోటీ పడే తుది జట్లు
భారత్ – హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, దీప్తి శర్మ, స్నేహ రాణా, అమంజోత్ కౌర్, ఉమా ఛెత్రి, అరుంధతి వర్మ.
దక్షిణాఫ్రికా – లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), నాడిన్ డి క్లెర్క్, మారిజాన్ కాప్, తజ్మిన్ బ్రిట్స్, అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, సినాలో జాఫ్తా, నోంకులులెకో మ్లాబా, మసాబాటా క్లాస్, సునే లూయస్, కరాబో మెసో, అన్నేరి డిర్క్సేన్, టుమీ నొగాడుక్సేన్, అన్నెకే బోస్స్హూ.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: