📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

WTC: డబ్ల్యూటీసీ: టెస్టు సిరీస్ లో ఓడినా టీమిండియానే టాప్… కానీ

Author Icon By Divya Vani M
Updated: October 26, 2024 • 8:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) గెలవాలనే ఆశతో బరిలోకి దిగిన టీమిండియాకు ఇవాళ భారీ నిరాశ ఎదురైంది న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 113 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది ఈ ఓటమితో టీమిండియా కేవలం టెస్టు సిరీస్‌నే కాకుండా, తమ ఆకాంక్షలకు తీవ్ర దెబ్బతిన్నాయి ఈ ఓటమి తర్వాత కూడా WTC పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ, రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా చాలా దగ్గరలోకి వచ్చేసింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 98 పాయింట్లు ఉండగా, ఆస్ట్రేలియాకి 90 పాయింట్లు ఉన్నాయి. అయితే, పాయింట్ల పరంగా కాకుండా పర్సెంటేజీ పరంగా చూస్తే, రెండు జట్ల మధ్య వ్యత్యాసం మరీ స్వల్పంగా మారింది. ప్రస్తుతం టీమిండియా పాయింట్ల పర్సంటేజీ 62.82 కాగా, ఆసీస్‌ పాయింట్ల పర్సంటేజీ 62.50గా ఉంది.

అంతేగాక, ఈ ఓటమితో టీమిండియా తన స్థానం కాపాడుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా నుంచి ఎదురవుతున్న పోటీకి ఇంకా తీవ్రత పెరిగింది. అగ్రస్థానం కాపాడుకోవడం కోసం భవిష్యత్తులో జరిగే మ్యాచ్‌ల్లో టీమిండియా మరింత జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి నెలకొంది ఇక న్యూజిలాండ్ జట్టు విషయానికొస్తే, ఈ సిరీస్‌లో 2-0 తేడాతో ఘన విజయం సాధించినప్పటికీ, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ఖాతాలో 60 పాయింట్లు ఉండగా, పాయింట్ల పర్సంటేజీ 50గా ఉంది ఈ సిరీస్ భారత జట్టుకు ప్రతికూలంగా మలుపు తిరిగినప్పటికీ, డబ్ల్యూటీసీ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉండటం మాత్రమే సానుకూలం. అయితే, పాయింట్ల పర్సంటేజీ తగ్గిపోవడం ద్వారా ఇండియా జట్టు కాస్త ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.

Australia New Zealand Team India WTC

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.