భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ గెలిచిన 25 రోజుల తర్వాత, మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) మెగా వేలం జరుగుతోంది. ఈరోజు, నవంబర్ 27వ తేదీ గురువారం న్యూఢిల్లీలో మొదలైన ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలు 2026 WPL సీజన్ కోసం తమ జట్లను పునరుద్ధరిస్తాయి. 2023లో WPL ప్రారంభమైనప్పటి నుంచి లీగ్లో ఇది మొదటి మెగా వేలం కాబట్టి ఈ వేలం ప్రత్యేకమైనది.
Read Also: WPL 2026: నేడే మహిళల ప్రీమియర్ లీగ్ వేలం
వేలంలో (WPL 2026) ఉన్న అన్క్యాప్డ్ ప్లేయర్లలో టాప్ లిస్ట్లో ఉన్న కొంతమందిని మనం ఇక్కడ చూద్దాం. వీళ్ల స్పెషలైజేషన్, బేస్ ప్రైజ్, ఎక్కడ నుంచి వచ్చారు అనే వివరాలను చూద్దాం. భారత్ అండర్ – 19 ప్రపంచకప్లో హ్యాట్రిక్ తీసి టాప్ వికెట్ టేకర్గా నిలిచిన వైష్ణవి శర్మ ప్రస్తుతం స్కౌట్స్ దృష్టిలో నిలిచిన ప్రధాన స్పిన్నర్. బేస్ ప్రైజ్ రూ. 10 లక్షలతో వేలంలోకి వచ్చింది.
సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో 11 మ్యాచ్ల్లో 21 వికెట్లు పడగొట్టింది. ఇంటర్ జోన్లో ఐదు మ్యాచ్లలో 12 వికెట్లు తీసుకుంది. లెఫ్ట్ ఆర్మ స్పిన్నర్లకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) లో భారీ డిమాండ్ ఉండటంతో ఆమెపై బిడ్డింగ్ వార్ కచ్చితంగా కనిపించనుంది.హర్యానాకు చెందిన దీయా యాదవ్ బేస్ ప్రైజ్ రూ.10 లక్షలతో వేలానికి వచ్చింది.

Mamata Madiwala
ఈ సీజన్లో సీనియర్ మహిళల టీ20లో అద్భుత ఫామ్ చూపెట్టింది 128 స్ట్రయిక్ రేట్, 59.5 యావరేజ్తో 298 పరుగులు చేసింది. ఇంటర్ జోన్లో 151 పరుగులు చేసింది. మూడు అర్ధ సెంచరీలు చేసిన ఈ బ్యాటర్ షఫాలి వర్మ (Shafali Varma) స్టయిల్ను ఫాలో అవుతూ అగ్రెసివ్ బ్యాటింగ్తో అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. హైదరాబాద్ జట్టులో కీలక ప్లేయర్గా ఉన్న మమత మడివాళ రూ. 10 లక్షల బేస్ ప్రైజ్లోకి వేలంలోకి వచ్చింది.
ఇండియా ఏ తరఫున డెబ్యూ మ్యాచ్లో 60 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్గా నిలిచింది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది. వికెట్కీపర్ బ్యాటర్లకు డబ్ల్యూపీఎల్లో భారీ డిమాండ్ ఉండటంతో మమతను పలు జట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఢిల్లీకి చెందిన ఆల్రౌండర్ తనీషా సింగ్ 2025 డీపీఎల్లో ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’గా నిలిచింది.
Trisha
ఆఫ్ స్పిన్, అగ్రెసివ్ బ్యాటింగ్తో బెస్ట్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకుంది. అండర్ – 23 టీ20 ట్రోఫీలో ఢిల్లీకి కెప్టెన్గా టైటిల్ అందించింది. ఆల్రౌండర్ కావడంతో ప్రతి జట్టు ఆమెను దక్కించుకోవడానికి ప్రయత్నించొచ్చు.ఇప్పటివరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో అమ్ముడుపోనప్పటికీ, ఈసారి త్రిషకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి.
అండర్ 19 ప్రపంచకప్ 2025లో 309 రన్స్తో పాటు 9 వికెట్లు కూడా తీసుకుంది. ఫైనల్లో 44 పరుగులు, మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో 147 రన్స్తో మంచి ఫామ్లో ఉంది.
Women’s Premier League (WPL) ఎప్పుడు ప్రారంభమైంది?
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2023 మార్చి 4న మొదటిసారి ప్రారంభమైంది.
WPL మొదటి సీజన్ ఎక్కడ జరిగింది?
మొదటి సీజన్ నవి ముంబైలో, జరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: