ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 (WPL 2026) టైటిల్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కైవసం చేసుకుంది. వడోదర వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది.
Read Also: BCCI news : అనురాగ్ ఠాకూర్కు బిగ్ రిలీఫ్, బీసీసీఐలో మళ్లీ ఎంట్రీ?
ఆర్సీబీ ఖాతాలో WPL టైటిల్స్ రెండూ
అంతేకాదు, టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇక, ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. WPL చరిత్రలో నాలుగు సీజన్లలోనూ టేబుల్ టాపర్గా నిలిచిన జట్టు ట్రోఫీ గెలవడం ఇదే తొలిసారి. దీంతో IPL (2025), WPL టైటిల్స్ రెండూ ఆర్సీబీ ఖాతాలో చేరడం మరో విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: