📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Women’s Kabaddi World Cup 2025: రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్

Author Icon By Aanusha
Updated: November 25, 2025 • 6:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత 30 రోజుల్లో భారతీయ క్రీడా చరిత్రలో మహిళా క్రీడామణులు చెరగని ముద్ర వేశారు. కేవలం ఒక్క నెల వ్యవధి కాలంలోనే ఏకంగా 3 ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టైటిళ్లను గెలుచుకుని దేశం పేరును ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెట్టారు. ఈ అద్భుతమైన విజయాల పరంపరలో చివరగా మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 (Women’s Kabaddi World Cup 2025) టైటిల్‌ను కైవసం చేసుకుని భారత క్రీడాకారిణులు హ్యాట్రిక్ పూర్తి చేశారు.

Read Also: Rohit Sharma: రోహిత్ కొత్త స్పీడ్‌లో ట్రైనింగ్

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో(Women’s Kabaddi World Cup 2025) భారత్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 35-28 తేడాతో బలమైన చైనీస్ తైపీని ఓడించి, వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 11 దేశాలు పాల్గొనగా, భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్‌ను గెలుచుకోవడం ఒక గొప్ప విషయం.

ఈ విజయం భారత కబడ్డీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది.ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. చైనీస్ తైపీ జట్టు భారత మహిళా జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే భారత కెప్టెన్ రితు నేగి, వైస్ కెప్టెన్ పుష్పా రాణా అద్భుతమైన నాయకత్వ పటిమ కనబరిచారు. ముఖ్యంగా సంజూ దేవి చేసిన సూపర్ రైడ్ జట్టుకు కీలక మలుపునిచ్చి, మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.

Women’s Kabaddi World Cup 2025: India becomes world champion for the second time

అభినందనలు తెలిపిన పీఎం నరేంద్ర మోదీ

ఈ ప్రదర్శనతో భారత్ విజయాన్ని సులభతరం చేసుకుంది. భారత జట్టు కేవలం ఫైనల్‌లోనే కాదు, టోర్నమెంట్ అంతటా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గ్రూప్ స్టేజ్‌లో థాయ్‌లాండ్‌ను 68-17 తేడాతో, నేపాల్‌ను 50-12 తేడాతో ఓడించింది. సెమీ-ఫైనల్‌లో బలమైన ఇరాన్ జట్టును 33-21 తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.భారత మహిళల జట్టు సాధించిన ఈ చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా జట్టును అభినందించారు. “కబడ్డీ వరల్డ్ కప్ 2025 గెలిచి దేశ గౌరవాన్ని పెంచిన మా మహిళల కబడ్డీ జట్టుకు అభినందనలు. ఈ విజయం ఎంతో మంది యువతకు కబడ్డీ (Kabaddi) లో ముందుకు వెళ్లడానికి, పెద్ద కలలు కనడానికి స్ఫూర్తినిస్తుంది” అని ఆయన అన్నారు.

ప్రత్యేకంగా అభినందనలు

ప్రొ కబడ్డీ లీగ్‌కు చెందిన కోచ్‌లు అజయ్ ఠాకూర్ (పుణేరి పల్టాన్), మన్‌ప్రీత్ సింగ్ (హర్యానా స్టీలర్స్) వంటి కబడ్డీ నిపుణులు కూడా టీమిండియాను ప్రత్యేకంగా అభినందించారు. మొత్తంగా భారత మహిళల జట్టు అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ కబడ్డీ వేదికపై తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

2025 kabaddi world cup women latest news Telugu News women world cup wins India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.