భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ల వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా.. స్మృతి మంధాన తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం వల్ల వాయిదా పడింది. వివాహం వాయిదా పడిన నేపథ్యంలో, తీవ్ర ఒత్తిడి, అలసట కారణంగా పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఇంటికి పంపినట్లు ఆయన బృందం ధ్రువీకరించింది.
Read Also: Shubman Gill: ఓటమిపై కెప్టెన్ గిల్ ఏమన్నాడంటే?
తొలుత సాంగ్లీలోని ఆసుపత్రిలో చేరిన పలాశ్ను, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ముంబైలోని గోరెగావ్లో ఉన్న ఎస్ఆర్వీ ఆసుపత్రికి తరలించారు.స్మృతి తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే పెళ్లిని వాయిదా వేయాలని పలాశ్ నిర్ణయించుకున్నట్లు ఆయన తల్లి అమితా ముచ్చల్ తెలిపారు. “పలాశ్కు స్మృతి తండ్రితో చాలా మంచి అనుబంధం ఉంది.
స్మృతి కంటే వాళ్లిద్దరే ఎక్కువ క్లోజ్. ఆయనకు అలా జరిగిందని తెలియగానే, స్మృతి కంటే ముందే పలాశ్ పెళ్లి ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు ఆగాలని చెప్పాడు” అని ఆమె వివరించారు.”ఆ విషయం తెలిసి పలాశ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏడుపు వల్ల అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది.

తీవ్రమైన ఒత్తిడి వల్లే
నాలుగు గంటల పాటు ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింది. ఐవీ డ్రిప్ ఇచ్చారు. ఈసీజీ, ఇతర పరీక్షలు చేశారు. రిపోర్టులన్నీ నార్మల్గా వచ్చినా, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు” అని అమితా ముచ్చల్ పేర్కొన్నారు.
ఈ మానసిక ఒత్తిడి కారణంగానే వైద్యులు పలాశ్ను తమ పర్యవేక్షణలో ఉంచి, పూర్తిగా కోలుకున్నాకే డిశ్చార్జ్ చేశారు. ఇదిలావుంచితే, పెళ్లి వాయిదాపై ఇప్పటివరకు పలాశ్ గానీ, స్మృతి (Smriti Mandhana) గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: