వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఈ ఏడాది మే నెలలో ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ల కోసం తమ వన్డే జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టు ఎంపికలో యువ క్రికెటర్లకు పెద్దపీట వేస్తూ, వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే జట్టుకు నాయకత్వం వహిస్తున్న షాయ్ హోప్ ఈసారి కూడా కెప్టెన్గా కొనసాగనున్నాడు.ఈసారి స్క్వాడ్లో ఆశ్చర్యకరంగా స్టార్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెర్ స్థానాన్ని కోల్పోయాడు. అతని స్థానంలో యువ బ్యాటర్ జ్యువెల్ ఆండ్రూ తిరిగి జట్టులోకి వచ్చాడు. వన్డే అరంగేట్రంలోనే శతకం సాధించిన అమీర్ జాంగూ కూడా ఈ జట్టులో చోటు సంపాదించాడు. ఓపెనింగ్కు బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్ కాంబినేషన్ను బోర్డు నమ్ముతోంది. కీసీ కార్టీ మూడో స్థానంలో రాణించే అవకాశముంది.మిడిల్ ఆర్డర్లో షాయ్ హోప్, రోస్టన్ చేజ్, జస్టిన్ గ్రీవ్స్, షెర్ఫేస్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్ లాంటి ఆటగాళ్లు జట్టు స్థిరత్వాన్ని నిలబెడతారని అంచనా. పేస్ బౌలింగ్ బాధ్యతలను అల్జారి జోసెఫ్ మోయనున్నాడు. అతనితో పాటు షమర్ జోసెఫ్, మాథ్యూ ఫోర్డ్ ఫాస్ట్ బౌలింగ్ అంచులను మరింత పటిష్టం చేయనున్నారు. స్పిన్ విభాగంలో గుడాకేష్ మోటీ ఏకైక ఫ్రంటైన్ స్పిన్నర్గా ఎంపికయ్యాడు.

West Indies : ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్కి వెస్టిండీస్ జట్టు ఖరారు
వెస్టిండీస్ ఐర్లాండ్ పర్యటన మే 21న ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 23, 25 తేదీల్లో వరుసగా రెండో, మూడో వన్డేలు జరగనున్నాయి. ఐర్లాండ్ టూర్ ముగిసిన వెంటనే జూన్ 2 వరకు ఇంగ్లండ్ వేదికగా మూడు వన్డేలు ఆడతారు. అనంతరం వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్తో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ కూడా ఆడనుంది.ప్రస్తుతం రూథర్ఫోర్డ్, షెపర్డ్ ఇద్దరూ ఐపీఎల్ 2025లో పాల్గొంటున్నారు. వీరు సిరీస్ ప్రారంభానికి ముందు జట్టులో చేరనున్నారు. అదే విధంగా కెప్టెన్ షాయ్ హోప్, జోసెఫ్ ప్రస్తుతం పాక్ సూపర్ లీగ్ ఆడుతుండగా, ఆ లీగ్ మే 18 నాటికి పూర్తవుతుంది.వెస్టిండీస్ జట్టులో ఖరారైన ఆటగాళ్లు: షాయ్ హోప్ (కెప్టెన్), జ్యువెల్ ఆండ్రూ, వీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, అల్జారి జోసెఫ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, షెర్ఫేస్ రూథర్ఫోర్డ్, జెడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్.
Read More : IPL 2025 : యువ ఆటగాళ్ల సెంచరీలు చేతిచెదిరాయి