Varanasi: 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు నార్పల క్రీడాకారిణి

Read Time:  1 min
Varanasi
Varanasi
FONT SIZE
GET APP

అనంతపురం జిల్లాకు మరోసారి జాతీయ స్థాయిలో గర్వకారణంగా మారింది .నార్పల మండలం నీలితోటి పల్లి గ్రామానికి చెందిన యువ క్రీడాకారిణి వెన్నపూస యమున 72వ జాతీయ వాలీబాల్ సీనియర్ నేషనల్స్ ఛాంపియన్‌షిప్ (పురుషులు , స్త్రీలు) పోటీలకు ఎంపిక కావడం జిల్లా క్రీడా వర్గాల్లో ఆనందోత్సాహాలు నింపింది.

Read Also: Mohammed Shami: క్రికెటర్ మహ్మద్ షమీకి ఈసీ నోటీసులు..

Varanasi

ఈ ప్రతిష్టాత్మక పోటీలు ప్రస్తుతం జనవరి 4 నుంచి 11 వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వారణాసిలో(Varanasi) జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని సాధించడం ద్వారా వెన్నపూస యమున జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకోనుంది. నీలితోటి పల్లి గ్రామానికి చెందిన వెన్నపూస చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె అయిన యమున చదువుతోపాటు క్రీడల్లో కూడా కష్టపడి సాధన చేస్తూ వాలీబాల్‌లో మంచి ప్రతిభ(Varanasi) కనబరిచి ఈ స్థాయికి చేరుకుంది. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకూ ఎదగడం అనేక మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. యమున ఎంపికైన సందర్భంగా అనంతపురం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ చైర్మన్ పి. సాయిప్రసాద్, ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్,సెక్రటరీ వెంకటేష్, కోచ్ జబిఉల్లా (జుబేర్) లు యమున నుప్రత్యేకంగా అభినందించారు. జిల్లా సీనియర్ క్రీడాకారులు యమునకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జాతీయ స్థాయిలో జిల్లా పేరు మరింత వెలుగులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Radha

రచయిత గురించి

Radha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.