అండర్-19 ప్రపంచకప్ (Under-19 World Cup) ను భారత యువ క్రికెట్ జట్టు కైవసం చేసుకోవడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిచ్చిన ఈ మెగా టోర్నీలో భారత జట్టు చూపిన ప్రదర్శన ప్రతి క్రికెట్ అభిమానిని గర్వపడేలా చేసింది.ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి యువ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒత్తిడిని తట్టుకుని, ఎంతో నిలకడగా, బాధ్యతాయుతంగా ఆడారని తెలిపాడు.
Read Also: T20 World Cup: సిద్ధీవినాయకుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు
కేవలం మొదటి అధ్యాయం మాత్రమే
క్లిష్ట సమయాల్లో అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్లా వ్యవహరించారని కితాబిచ్చాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ ఒకరి కోసం ఒకరు ఆడారని, ఇది వారి బలమైన వ్యక్తిత్వాన్ని, ఐకమత్యాన్ని తెలియజేస్తుందని వివరించాడు.“ప్రతిభ మిమ్మల్ని గుర్తింపు పొందేలా చేస్తుంది, కానీ మిమ్మల్ని ముందుకు నడిపించేది మీ టెంపర్మెంట్ మాత్రమే” అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఈ యువ జట్టులో ప్రతిభతో పాటు అద్భుతమైన టెంపర్మెంట్ కూడా పుష్కలంగా ఉందని అభిప్రాయపడ్డాడు.ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని యువ ఆటగాళ్లకు సూచించాడు. ఇది వారి కెరీర్లో కేవలం మొదటి అధ్యాయం మాత్రమేనని, భారత క్రికెట్లో ఈ కుర్రాళ్ల పేర్లు చాలా కాలం పాటు వినిపిస్తూనే ఉంటాయని రవిశాస్త్రి తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: