అండర్-19 ఆసియాకప్ ఫైనల్ (Under-19 Asia Cup) మ్యాచులో టీమ్ఇండియా ఘోర పరాజయం పాలైంది. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసి ఆసియా కప్ విజేతగా నిలిచింది. పాకిస్థాన్కు ఇది రెండో అండర్-19 ఆసియా కప్ టైటిల్ (Under-19 Asia Cup). గతంలో 2012లో భారత్తో కలిసి సంయుక్త విజేతగా నిలిచిన పాక్.. ఈ సారి ఏకఛత్రాధిపత్యం వహించింది.
Read Also: IND vs SL 1st women’s T20: నేడు తొలి T20

భారీ స్కోరు
ఈ మ్యాచ్ లో భారత్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సమీర్ మిన్హాస్ 172 పరుగులతో అద్భుత శతకం చేశాడు. అనంతరం 348 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ దారుణంగా విఫలమైంది. స్టార్ బ్యాటర్లు ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. దాంతో 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది.
భారత ఇన్నింగ్స్ లో బౌలర్ దీపేశ్ దేవేంద్రన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వైభవ్ సూర్య వంశీ 26, కెప్టెన్ ఆయుష్ మాత్రే 2, ఆరోన్ జార్జ్ 16, విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిజ్ఞాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6, కిషన్ సింగ్ 3 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అలీ రెజా 4 వికెట్లతో భారత్ ను దెబ్బతీశాడు. మహ్మద్ సయ్యాం 2, అబ్దుల్ సుభాన్ 2, హుజైపా అహ్సాన్ 2 వికెట్లు తీశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: