ACC పురుషుల అండర్-19 ఆసియా కప్ 2025 ప్రారంభమైంది. టోర్నమెంట్ తొలి మ్యాచ్లో భారత జట్టు దుబాయ్లోని ICC అకాడమీ గ్రౌండ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తో తలపడింది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కేవలం 95 బంతుల్లోనే 171 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతని ఇన్నింగ్స్లో ఏకంగా 14 భారీ సిక్సర్లతో పాటు 9 ఫోర్లు ఉండటం విశేషం. ఈ మెరుపు ఇన్నింగ్స్తో భారత జట్టు భారీ స్కోరు వైపు దూసుకెళ్తోంది.
Read Also: Messi Statue: 70 ఫీట్ల ఎత్తైన మెస్సి విగ్రహం.. ఎక్కడంటే?
ఆరంభం నుంచే యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డాడు
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అసాధారణ ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్, ఆరంభం నుంచే యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన పవర్ఫుల్ షాట్లతో మైదానం నలువైపులా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: