బెంగళూరులోని ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. భారత్ క్రికెట్కు గుర్తుగా నిలిచే ఈ మైదానం భద్రతా నిబంధనలను పట్టించుకోకపోవడంతో అధికారులు కఠినంగా స్పందించారు. సోమవారం నుంచి స్టేడియానికి విద్యుత్ సరఫరాను (Electricity supply) పూర్తిగా నిలిపేశారు.ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన అనంతరం ఆర్సీబీ నిర్వహించిన విజయోత్సవంలో స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట ఘటనను ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. అందులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే ఇప్పుడు ఈ విద్యుత్ కట్ నిర్ణయం కలకలం రేపుతోంది.కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను పాటించడంలో పూర్తిగా విఫలమైందని ఫైర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అవసరమైన సేఫ్టీ పరికరాలు లేకపోవడం, అత్యవసర నిష్క్రమణ మార్గాలు సరిగా అమలులో లేని పరిస్థితులు వెల్లడయ్యాయి.
పలుమార్లు హెచ్చరికలు ఇచ్చినా స్పందించలేదు
ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ డీజీపీ జూన్ 4న KSCAకి లేఖ రాశారు. అది జూన్ 10న బెస్కామ్ కార్యాలయానికి చేరింది. అయినా యాజమాన్యం నుంచి ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో విద్యుత్ నిలిపివేయాలని బెస్కామ్ నిర్ణయం తీసుకుంది.KSCA వారు వారం సమయం కావాలని అధికారులను కోరినా, ఆ గడువు పూర్తయ్యేసరికీ ఏ మార్పూ కనిపించలేదు. దీంతో ఫైర్ సర్వీసెస్ సూచన మేరకు విద్యుత్ను కట్ చేశారు.
అగ్ని ప్రమాద భద్రత లేకుండానే మ్యాచ్లు?
ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు అన్నీ అవసరమైన భద్రతా ప్రమాణాలు లేకుండానే నిర్వహించారని అధికారులు తెలిపారు. తొక్కిసలాట జరిగిన రోజు కూడా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవని విచారణలో తేలింది.ఈ ఘటనతో KSCAపై పెద్దగా ఒత్తిడి ఏర్పడింది. భద్రతా ప్రమాణాలను వెంటనే అమలు చేయకపోతే స్టేడియం నిర్వహణకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
Read Also : Iran : మళ్లీ కొన్ని నెలల్లో ఇరాన్ అణు కార్యక్రమం మళ్లీ మొదలు