📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

త్రిషకు తెలంగాణ సీఎం కోటి నజరానా.

Author Icon By Anusha
Updated: February 5, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో తెలంగాణలోని భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష.. అటు బ్యాటింగ్‌లో,ఇటు బౌలింగ్‌లో సత్తా చాటింది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన త్రిష.. 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా అద్భుత ప్రదర్శన ఇచ్చింది. 33 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా త్రిష (309) నిలిచింది. అందులో ఒక సెంచరీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ టోర్నీలో 7 వికెట్లు కూడా తీసింది. ఈ క్రమంలోనే త్రిష… ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచింది.ప్రపంచ కప్ విజయం తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న క్రికెటర్లు గొంగడి త్రిష, కేసరి ధ్రుతిలకు ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు.. క్రికెటర్లకు శాలువాలతో సన్మానం చేశారు. వీరితో పాటు టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌ నౌషిన్‌ అల్‌ ఖదీర్‌, ట్రైనర్‌ షాలినిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన త్రిషను ప్రత్యేకంగా అభినందించారు.

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో భాగమైన క్రికెటర్ గొంగడి త్రిషను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నజరానా ప్రకటించారు. వివరాలు.. సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం రోజున ఆయన నివాసంలో క్రికెటర్ గొంగడి త్రిష కలిశారు. ఈ సందర్భంగా అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను అభినందించారు. త్రిషను శాలువాలతో సత్కరించారు. ఆమె భవిష్యత్ లో దేశం తరుపున మరింతగా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. త్రిషకు కోటి రూపాయల నజరానా ప్రకటించారు.

Breaking News in Telugu CM Revanth Reddy Google News in Telugu hyderabad Latest News in Telugu Paper Telugu News Telangana Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news under -19 women t-20 world cup. gongadi trisha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.