అంతర్జాతీయ టీ20 క్రికెట్ (International T20 cricket) లో భారత జట్టు కొత్త చరిత్రను సృష్టించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) బౌలింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. దీని ఫలితంగా టీ20 ఫార్మాట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్ విభాగాల్లోనూ భారత ఆటగాళ్లే నంబర్ వన్ స్థానాల్లో ఉండటం అరుదైన ఘనతగా నిలిచింది.
ఇప్పటికే టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య (Hardik Pandya) మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి కూడా బౌలింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని సాధించడం భారత క్రికెట్ ఆధిపత్యానికి నిదర్శనం. ప్రపంచ టీ20 క్రికెట్ వేదికపై భారత్ ఇంతటి ఆధిపత్యం చూపించడం అరుదైన సందర్భం అని చెప్పాలి.
అద్భుత ప్రదర్శన కనబరచడమే వరుణ్ ర్యాంకు
గత కొంతకాలంగా అద్భుత ప్రదర్శన కనబరచడమే వరుణ్ ర్యాంకు మెరుగుపడటానికి కారణమైంది. సీజన్ లో నిలకడగా రాణించడంతో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి ప్రపంచ నంబర్ 1 బౌలర్గా నిలిచాడు.ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి 733 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, అతని తర్వాత కివీస్ పేసర్ జాకబ్ డఫీ (Jacob Duffy) (717), విండీస్ స్పిన్నర్ అకీల్ హుసేన్ (707) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తర్వాత ఈ ‘నెంబర్ వన్’ ఘనత సాధించిన మూడో బౌలర్గా వరుణ్ రికార్డు సృష్టించాడు.
మరోవైపు, గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) రెండు స్థానాలు కోల్పోయి 8వ ర్యాంకుకు పడిపోయాడు.ఈ ఏడాది ఐపీఎల్లోనూ అద్భుతంగా రాణించిన వరుణ్, అదే ఫామ్ను అంతర్జాతీయ స్థాయిలోనూ కొనసాగిస్తున్నాడు. రాబోయే టీ20 ప్రపంచ కప్కు ముందు వరుణ్ చక్రవర్తి ఫామ్లోకి రావడం, నంబర్ 1 ర్యాంకు సాధించడం భారత జట్టుకు ఎంతో బలాన్నిస్తుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: