ఇంగ్లాండ్ (England)పై లీడ్స్ వేదికగా జరుగుతున్న టెస్టులో భారత జట్టు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 93 ఏళ్ల టెస్టు ప్రస్థానంలో ఒక్క మ్యాచ్లోనే ఐదు సెంచరీలు బాదిన ఘనత భారత్ గెల్చుకుంది. ఇది దేశ క్రికెట్ చరిత్రలో ఇదివరకు ఎప్పుడూ జరగని విశేషం.భారత బ్యాటర్లు (Indian batters)ఈ టెస్టును పరుగుల పండుగగా మార్చారు. తొలి ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134)లు అద్భుత సెంచరీలతో ఇన్నింగ్స్ను నిలబెట్టారు. వీరి శతకాలతో భారత్ 471 పరుగుల భారీ స్కోరు చేసింది.
రాహుల్, పంత్ మెరుపులు రెండో ఇన్నింగ్స్లో
భారత బ్యాటింగ్ మాంత్రికత రెండో ఇన్నింగ్స్లోనూ కొనసాగింది. తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకంతో పరిమితమైన రాహుల్, ఈసారి అద్భుత శతకాన్ని (137) అందుకున్నాడు. పంత్ మాత్రం ఇంకో మెట్టు ఎక్కాడు. 118 పరుగులు చేసి, ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు.ఒకే టెస్టులో ఐదు సెంచరీలు సాధించడం టెస్ట్ చరిత్రలో ఇది ఆరోసారి మాత్రమే. విదేశీ మైదానాల్లో అయితే కేవలం రెండోసారి. 1955లో కింగ్స్టన్లో ఆస్ట్రేలియా ఇది సాధించింది. ఇప్పుడు భారత్ ఆ ఫీట్ను పునరావృతం చేసింది.
ఇంగ్లాండ్ ఛేజ్లో నిదానంగా ప్రారంభం
భారత జట్టు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్ధారించింది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 350 పరుగుల దూరంలో ఉంది. భారత్ గెలవాలంటే 10 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.
గతంలో ఐదు సెంచరీలు చేసిన జట్లు
1955లో ఆస్ట్రేలియా, 2007లో శ్రీలంక, 2012లో దక్షిణాఫ్రికా, 2019లో ఇంగ్లాండ్ వంటి జట్లు ఒక్క టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేశాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ జాబితాలో చేరింది.ఇప్పటికే బ్యాటర్లు రికార్డులు సృష్టించారు. bowlers చేతుల్లో చివరి రోజు గేమ్ ఉంది. గిల్ సేన విజయం సాధిస్తుందా? లేక ఇంగ్లాండ్ తిరిగి పోరాడుతుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
Read Also : Sunil Gavaskar: సిరాజ్పై గవాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు