టీ20 ప్రపంచకప్–2026 (T20WC 2026) కు సమయం దగ్గరపడుతున్న వేళ భారత క్రికెట్ జట్టును గాయాల సమస్య తీవ్రంగా కలవరపెడుతోంది. మెగా టోర్నీకి ముందు జట్టు పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాల్సిన సమయంలో కీలక ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యలతో బయటకు వెళ్లిపోవడం టీమ్ మేనేజ్మెంట్కు ఆందోళన కలిగిస్తోంది. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ కోలుకోగా, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. తాజాగా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్లో పేసర్ హర్షిత్ రాణా మోకాలి నొప్పితో బాధపడి, కేవలం ఒక ఓవర్ మాత్రమే వేసి మైదానం వీడాడు. దీంతో అతడి ప్రపంచకప్ లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్లో భారత్ 240 పరుగులు చేయగా సౌతాఫ్రికా 210 పరుగులు చేసింది.
Read Also: T20 World Cup: భారత్తో పాక్ మ్యాచ్ ఆడదు: షెహబాజ్

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: