టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) కోసం భారత జట్టును శనివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా సూర్య, వైస్ కెప్టెన్గా గిల్ను కొనసాగించనున్నారు. సౌతాఫ్రికా, సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో నుంచి ఒకరిద్దరిని తొలగించి వారి స్థానంలో ఇషాన్ కిషన్, పంత్, అయ్యర్, రింకూ, జురెల్కు చోటు కల్పించే అవకాశాలున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అయితే సూర్య, గిల్ ఫామ్ ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నాయి.
Read Also: FIFA: ఫిఫా వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
తీవ్ర సందిగ్ధత
మరోవైపు అద్భుతమైన రికార్డు ఉన్న యశస్వి జైస్వాల్కు మళ్లీ అవకాశం దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి. వికెట్ కీపర్ల స్థానంపై కూడా తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఆసియా కప్ నుంచి సంజూ శాంసన్, జితేష్ శర్మలను కొనసాగిస్తున్నప్పటికీ, జితేశ్ ఒక్క ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడలేదు.
సంజూ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసి చివరకు తుది జట్టు నుంచి తప్పించారు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. టోర్నీకి ముందు భారత్, న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ప్రపంచకప్ (T20 World Cup 2026) లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: