టీ20 ప్రపంచకప్ (T20 World Cup) లో శ్రీలంక జట్టు ఒమన్పై 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఈ మెగా టోర్నీలో లంకకు ఇది వరుసగా రెండో గెలుపు కావడం విశేషం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి పసికూన ఒమన్ను చిత్తు చేసింది. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఒమన్ బౌలింగ్ ఎంచుకుంది.
Read Also: Sports: హగ్ డే సందర్బంగా CSK స్పెషల్ పోస్ట్
226 పరుగుల భారీ లక్ష్యఛేదన
లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్ రత్నాయకే (28 బంతుల్లో 60) అద్భుత అర్ధశతకాలతో రాణించారు. ఆఖర్లో కెప్టెన్ దసున్ శనక కేవలం 20 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ఒమన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.
లంక బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులకే పరిమితమైంది. ఒమన్ జట్టులో మహమ్మద్ నదీమ్ (53 నాటౌట్) ఒక్కడే అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేశాడు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర రెండేసి వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో గ్రూప్-బిలో శ్రీలంక అగ్రస్థానానికి చేరింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: