భారత్, శ్రీలంక సంయుక్త వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup) లో గాయాల భయం జట్లను వెంటాడుతోంది. ఇప్పటికే కీలక మ్యాచ్లు కొనసాగుతున్న ఈ మెగా టోర్నీలో పలువురు ప్రముఖ ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీ నుంచి వైదొలగాల్సి వస్తుండటం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. తాజాగా ఐర్లాండ్, జింబాబ్వే జట్లకు చెందిన ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు టోర్నీకి దూరమయ్యారు. ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఎడమ మోకాలి లిగమెంట్ దెబ్బతినడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. అతని స్థానంలో సామ్ టాపింగ్ జట్టులోకి వచ్చారు. ఫిబ్రవరి 11న ఆస్ట్రేలియాతో మ్యాచ్లో స్టిర్లింగ్, ఒమన్తో మ్యాచ్లో టేలర్ గాయపడ్డారు.
Read Also: T20 WC 2026: ఆస్ట్రేలియా ఆల్రౌండర్ స్టోయినిస్ అరుదైన రికార్డు
రిటైర్ట్ హర్ట్గా
సుదీర్ఘ నిషేధం తర్వాత జింబాబ్వే జట్టులోకి వచ్చిన 40 ఏళ్ల టేలర్ ప్రస్థానం కూడా ముగిసింది. లీగ్ దశలో ఒమన్తో మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తుండగా అతడు కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. 31 పరుగుల వద్ద రిటైర్ట్ హర్ట్గా మైదానం వీడిన టేలర్కు స్కానింగ్ పరీక్షలు జరపగా.. కోలుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. శుక్రవారం ఆస్ట్రేలియాతో టాస్కు ముందు కెప్టెన్ సికిందర్ రజా మాట్లాడుతూ.. టేలర్ ఇంకా కోలుకోలేదని, అతడు మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉండడని చెప్పాడు. సో.. అతడి స్థానంలో కరన్ స్క్వాడ్లోకి వచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: