భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup) ప్రారంభం కానుంది. అయితే భారత్లో మా ఆటగాళ్లకు భద్రత లేదంటూ.. బంగ్లాదేశ్ జట్టు ఇప్పటికే ఈ టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు ఆడే అవకాశం లభించింది. మరోవైపు బంగ్లాకు మద్దతు పాకిస్థాన్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా వెల్లడించారు.
Read Also: T20WC 2026: టీమ్ ఇండియాకు గాయాల బెడద
షెహబాజ్ షరీఫ్కు ధన్యవాదాలు
మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్ యువజన, క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ హర్షం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్కు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఫేస్బుక్లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలను ఆసిఫ్ నజ్రుల్ తన పోస్ట్లో ఉటంకించారు.
“టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ను తొలగించినందుకు నిరసనగా భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని మా దేశం నిర్ణయించింది. క్రీడా మైదానంలో రాజకీయాలు ఉండకూడదు. మేం బంగ్లాదేశ్కు పూర్తిగా మద్దతుగా నిలవాలి” అని షెహబాజ్ షరీఫ్ బుధవారం ఇస్లామాబాద్లో జరిగిన కేబినెట్ సమావేశంలో అన్నట్లు నజ్రుల్ పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: