T20 World Cup 2026: భారత్‌పై ఒత్తిడి ఉంది: దక్షిణాఫ్రికా కోచ్

Read Time:  1 min
T20 World Cup 2026: భారత్‌పై ఒత్తిడి ఉంది: దక్షిణాఫ్రికా కోచ్
FONT SIZE
GET APP

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ 2026లో ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ టీమ్ ఇండియాను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్-8లో భారత్‌పై గెలవడమే కాకుండా సెమీఫైనల్స్, ఫైనల్స్‌కు చేరాలనే ఒత్తిడి భారత ఆటగాళ్లపై స్పష్టంగా కనిపిస్తోందని, ఆ ఒత్తిడినే తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Read Also: IND W vs AUS W 3rd T20: మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్

భారత పరిస్థితులపై అవగాహన ఉంది – గెలవడమే మా లక్ష్యం

గతేడాది భారత్‌లో పర్యటించిన అనుభవం తమ జట్టుకు ఉందని,మెగా టోర్నీల్లో ప్రతి జట్టుపై ఒత్తిడి ఉంటుందని, అయితే భారత్ వంటి పెద్ద జట్టుపై ఉండే ఒత్తిడిని చాలా మంది పట్టించుకోరని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది తాము ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఒకటని ఆయన అన్నారు..

T20 World Cup 2026: Pressure on India: South Africa coach
T20 World Cup 2026: Pressure on India: South Africa coach

అలాగే అభిషేక్ శర్మ (Abhishek Sharma) వరుస డకౌట్ల గురించి కూడా అతడు వ్యాఖ్యలు చేశాడు. ‘మేమంతా అత్యుత్తమ జట్టుతో మ్యాచ్ ఆడితే ఉండే ఒత్తిడి గురించి మాట్లాడుతున్నాం. నిజానికి వారు ఏ ఒత్తిడిలో ఉన్నారో తెలియదు. తాను ఆడిన మూడు మ్యాచుల్లో వరుసగా డకౌట్ అయిన వ్యక్తి, జట్టులో తన స్థానం గురించి పడే ఒత్తిడి గురించి నేను మాట్లాడటం లేదు’ అని అన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.