భారత్తో జరిగే టీ20 ప్రపంచకప్ (T20 World cup 2026) మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చేసిన ప్రకటనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పందించింది. ఈ అంశం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే పీసీబీ నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ ప్రకటన అంతర్జాతీయ క్రీడా సమగ్రతను దెబ్బతీస్తుందని, పాకిస్థాన్లోనూ క్రికెట్పై దీర్ఘకాలిక పరిణామాలు ఉండవచ్చని పేర్కొంది.
Read Also: Sunil Gavaskar : పాక్పై వేటా? ఐసీసీకి గవాస్కర్ షాకింగ్ సూచనలు!
పాకిస్తాన్ అన్ని మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి
దీనిపై పున:పరిశీలన చేయాలంది. జాతీయ విధానాలను తాము గౌరవిస్తామని, అయితే అందరికీ ఆమోదమైన నిర్ణయాన్ని PCB తీసుకోవాలని ఆకాంక్షించింది.ఒక దేశం కావాలనే మ్యాచ్ను వదిలేస్తే, టోర్నీ గౌరవం దెబ్బతింటుందని స్పష్టం చేసింది. అలాగే, ప్రభుత్వాల పాత్రను గౌరవిస్తున్నామని చెప్పినా ఈ నిర్ణయం క్రికెట్కు,
ముఖ్యంగా పాకిస్తాన్ అభిమానులకు కూడా మంచిది కాదని ఐసీసీ వ్యాఖ్యానించింది.ఈ టోర్నీలో పాకిస్తాన్ గ్రూప్-ఏలో ఉంది. భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్లతో కలిసి పోటీపడనుంది. పాకిస్తాన్ అన్ని మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్తో తొలి మ్యాచ్ ఆడనుండగా, ఫిబ్రవరి 10న అమెరికాతో, ఫిబ్రవరి 18న నమీబియాతో తలపడనుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: