టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026) లో భాగంగా ఆదివారం భారత క్రికెట్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ అనంతరం పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేసారు.. జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, సీనియర్ ఆటగాళ్లపై కఠిన వ్యాఖ్యలు చేశారు.బాబర్ ఆజమ్, స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది, ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్లను తదుపరి మ్యాచ్లకు పక్కన పెట్టాలని డిమాండ్ చేశాడు.
Read Also: Tilak Varma slow batting : తిలక్ వర్మపై గంభీర్ అసహనం, కారణం ఏమిటి?
యువకులకు అవకాశం ఇవ్వాలి
వరుస వైఫల్యాల తర్వాత కూడా సీనియర్లనే నమ్ముకోవడం సరికాదని, యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఒక పాకిస్థానీ న్యూస్ షోలో అఫ్రిది మాట్లాడుతూ.. “నేనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. బాబర్, షహీన్, షాదాబ్ ముగ్గురినీ బెంచ్కే పరిమితం చేస్తాను. వారి స్థానంలో కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి, వారిలో ఆత్మవిశ్వాసం నింపుతాను. కీలక మ్యాచ్లలో సీనియర్లు రాణించనప్పుడు, వారిని జట్టులో కొనసాగించడంలో అర్థం లేదు” అని ఘాటుగా విమర్శించాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) అద్భుత ఇన్నింగ్స్తో 175 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ 61 పరుగుల తేడాతో గెలిచి, సూపర్ 8 దశకు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్లలో పాక్పై భారత్కు ఇది 8వ విజయం కావడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: